Crime News: మాదాపూర్లోని సమతామూర్తి చిట్ఫండ్ ప్రైవేట్ పేరుతో పలువురు అమాయక బాధితులను మోసగించిన ఇద్దరు ఆర్థిక మోసగాళ్లు ఎల్పుల శ్రీనివాస్, ఎల్పుల రాకేష్ వర్మలను మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ప్రాథమిక అనుమానితుడు ఎల్పుల శ్రీనివాస్, అతని సహచరులు ఎల్పుల రాకేష్ వర్మ మరియు గణేష్లతో కలిసి మాదాపూర్లో సమతామూర్తి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించాడు.
చిట్ ఫండ్స్ ముసుగులో అమాయకుల నుంచి గణనీయమైన మొత్తాలను కూడబెట్టారు. ఈ ముగ్గురూ చిట్లపై భారీ రాబడి వచ్చిన తరువాత అమాయక బాధితులను మోసం చేశారు.మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితుల నుండి 1 నుంచి 2 కోట్లు దోచుకున్నట్టు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. మిగతా బాధితులు ఆధారాలతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మాదాపూర్ పోలీసులు కోరారు.
నిందితులపై సైబరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 420 మరియు 406 మరియు తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1999 సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు.
Also Read: Hyderabad: చెప్పుల కోసం తమ్ముడిని హత్య చేసిన అన్నయ్య