Site icon HashtagU Telugu

KTR: అమెరికా పోలీసులపై కేటీఆర్ ఫైర్, ఎందుకంటే

KT Rama Rao

Telangana Minister KTR America Tour

KTR: తెలంగాణ ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కె.టి.రామారావు అమెరికా పోలీసులపై మండిపడ్డారు. వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని మృతి చెందడంపై అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ఘటన అత్యంత బాధకు గురిచేసిందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ అధికారులతో సంప్రదించి 23 ఏళ్ల జాహ్నవి కందుల కుటుంబానికి న్యాయం చేయాలని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టిని మంత్రి కేటీఆర్ కోరారు.

ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌ను తన కౌంటర్‌తో కలిసి ఈ విషయాన్ని పరిష్కరించాలని, స్వతంత్ర దర్యాప్తును డిమాండ్ చేయాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల జనవరిలో కెవిన్ డేవ్ అనే సియాటిల్ పోలీసు అధికారి నడుపుతున్న పోలీసు వాహనం ఢీకొని మరణించింది. జాహ్నవి మరణం గురించి సియాటెల్ పోలీసు సరదాగా మాట్లాడుతున్న ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇది ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అమెరికాను భారత్‌ కోరింది.

Also Read: Birth Certificate: అక్టోబర్ 1 నుంచి జనన మరణాల నమోదు తప్పనిసరి