Charan: ‘చరణ్ – కొరటాల’ కాంబో మూవీ ఫిక్స్… పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న మూవీ..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన అపజయమన్నదే ఎరుగరు.

  • Written By:
  • Publish Date - February 8, 2022 / 09:29 AM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన అపజయమన్నదే ఎరుగరు. ప్రభాస్ తో ‘మిర్చి’ సినిమా నుంచి మొదలుకుని మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ వరకు ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్సే. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీని కొరటాల తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే, ‘మిర్చి’ సినిమా తర్వాత రామ్ చరణ్ తో కొరటాల శిక ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో ఒక ప్రాజెక్టు కుదిరినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీలో చరణ్ తో ఒక చిన్న రోల్ చేయించాలని కొరటాల అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా ఓ మల్టీస్టారర్ సినిమాగా తయారైంది. దీంతో రామ్ చరణ్ తో సోలో హీరోగా తీయాలన్న కొరటాల కల ఇంకా నెరవేరలేదు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ సమయంలోనే చరణ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక లైన్ అనుకున్న కొరటాల, ఆయనకి వినిపిస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కొరటాల తాను తెరకెక్కించే ప్రతి చిత్రంలోనూ సామాజిక అంశాల్లో ఏదో ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాని తెరకెక్కిస్తారు. కొరటాల తన గత చిత్రాలైన ‘మిర్చి’ లో ఫ్యాక్షన్ ను పక్కనపెట్టి, ప్రేమిస్తే బంధాల విలువ ఎలా ఉంటుందో చెప్పారు. ‘శ్రీమంతుడు’ లో దత్తత అంటూ… ‘జనతా గ్యారేజీ’ లో ప్రకృతిని ప్రేమించాలంటూ… ఏదో ఒక అంశాన్ని స్పృషిస్తూ… ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ తో తీయనున్న సినిమాలోనూ ఇలాంటి ఏదో ఓ అంశాన్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మరో వైపు తమిళ దర్శుకుడు శంకర్ తో ప్రాజెక్టును పట్టాలెక్కించిన రామ్ చరణ్… ఆ తరువాత ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే… కొరటాలతో కలిసి వచ్చే ఏడాది ద్వితీయార్దంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడని టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే… ఇక చరణ్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. వీరి కాంబినేషన్ లో వచ్చే మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండనుందని సమాచారం.