Konda Vishweshwar: తెలంగాణలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు

  • Written By:
  • Updated On - January 12, 2022 / 08:45 PM IST

దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై పన్నులు వేసి భారీగా సొమ్ము చేసుకుంటోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎంత డబ్బు సంపాదిస్తున్నారో, మేం ఆర్టీఐ దాఖలు చేశామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాకు అస్పష్టమైన స్పందన వచ్చింది. వారు నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారా? అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.