Khairatabad : ఖైరతాబాద్ గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీ ఛైర్మ‌న్ క‌న్నుమూత‌

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ క‌న్నుమూశారు....

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 10:05 AM IST

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో 1954లో ఖైరతాబాద్‌లో తొలిసారి ఒక అడుగు వినాయకుడిని ప్రతిష్టించారు. ఆ తర్వాత ఏటా ఒక్కో అడుగు పెంచుతూ 2014 నాటికి 60 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత శోభయాత్ర నిబంధనలతో వినాయకుడి ఎత్తును పెంచడం ఆపేశారు. గ‌త నెల‌లో జ‌రిగిన వినాయ‌క ఉత్స‌వాల్లో ఆయ‌న చురుకుగా పాల్గొన్నారు. ద‌గ్గ‌రుండి అన్ని ఏర్పాట్లును చేశారు. అయితే అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన సుద‌ర్శ‌న్ ఈ రోజు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు.