AP DGP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌యా పోలీస్ బాస్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి..!

  • Written By:
  • Publish Date - February 15, 2022 / 03:41 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌యా డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి అయిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నారు. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా, హైదరాబాద్‌ వెస్ట్ ఐజీగా, ఈస్ట్ జోన్ డీసీపీగా, విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా వివిధ హోదాల్లో పని చేశారు.కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించిన రాజేంద్రనాథ్‌ రెడ్డి, సర్వీస్‌లో జాతీయస్థాయిలో రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తింపు పొందారు. మ‌రి ఏపీలో ఈ న‌యా పోలీస్ బాస్ ప‌నితీరు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేస్తూ జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.