మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా ఢిల్లీలో నివాళులు అర్పించిన మంత్రి గంగుల కమలాకర్

మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Published By: HashtagU Telugu Desk
gangula kamalakar

gangula kamalakar

మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిబాపూలే బహుజనులకు, వెనుకబడిన తరగతులకు చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూలే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి పూలే పేరుతో బీసీ గురుకులాలు, విదేశీ విద్యా పథకాలను అమలు చేస్తోంది.
అనంతరం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతులకు యాసంగి వరిధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీలోని మహాదీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వెంట కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పించుకోవద్దని, రైతులు పండించే పంటను వ్యాపార కోణంలో కాకుండా సామాజిక బాధ్యతతో చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కేంద్రం ఎన్నో పథకాలు తీసుకురాలేదని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.
రైతులపై కేంద్ర భాజపా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని కోరుతూ చేపట్టిన మహాదీక్ష దేశ చరిత్రలో విశిష్టమైనది. రాష్ట్ర రైతాంగం కోసం దేశరాజధానిలో స్వయంగా ముఖ్యమంత్రి దీక్ష చేయడం, ఈ దీక్షకు జాతీయ రైతు సంఘాలు, రాకేష్ తికాయత్ వంటి నేతలు సంఘీభావం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునరాలోచించి పండించిన పంటల సేకరణకు దిశానిర్దేశం చేయాలి. తెలంగాణ రైతులు.

కార్యక్రమంలో మంత్రి గంగులతోపాటు కరీంనగర్ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, నాయకులు చల్లా హరిశంకర్, కర్ర శేఖర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

  Last Updated: 11 Apr 2022, 12:44 PM IST