భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. పదవీ విరమణ చేసిన సీజేఐ ఎన్వీ రమణ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యూయూ లలిత్తో ప్రమాణం చేయించారు. నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నందున ఆయనకు 74 రోజుల పదవీకాలం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్రమంత్రులు హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన సీజేఐ ఎన్వీ రమణ సూచన మేరకు నడుచుకుంటానని చెప్పారు. అతను 13 ఆగస్టు 2014న బార్ నుండి నేరుగా భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు.
UU Lalit Sworn: జస్టిస్ లలిత్ అనే నేను..!
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

Lalith
Last Updated: 27 Aug 2022, 11:40 AM IST