తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల 5 నిమిషాలకు రాజ్భవన్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరగడంతోనే.. చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.