Jr NTR: ఫిబ్రవరిలో సెట్స్ పైకి ‘ఎన్టీఆర్ – కొరటాల’ కాంబో మూవీ..!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది. హీరోకి, డైరెక్టర్ కి గనుక సింక్ అయితే... ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. సరిగ్గా అలాంటి ఓ కాంబినేషనే ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతోంది.

  • Written By:
  • Publish Date - January 31, 2022 / 12:04 PM IST

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది. హీరోకి, డైరెక్టర్ కి గనుక సింక్ అయితే… ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. సరిగ్గా అలాంటి ఓ కాంబినేషనే ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతోంది. అదేనండీ… జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్. వీరి కలయికలో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో మనకు తెలుసు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని 2016లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, బంపర్ హిట్ కొట్టారు. ఈ మూవీలో దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ నటనలోని కొత్త కోణాన్ని అద్బుతంగా ఆవిష్కరించారు. అలాంటి ఈ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందుతుంది అంటేనే.. అంచనాలు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు.

తాజాగా వీరి కాంబినేషన్ కు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం చాలా ఆలస్యమైంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం… ఈ మూవీ ఫిబ్రవరి 7 నుంచి పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇప్పుడంతా పాన్ ఇండియా మేనియా కొనసాగుతున్న నేపధ్యంలో… ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవల్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక డైరెక్టర్ కొరటాల ఎప్పుడూ కూడా తన సినిమాల్లో సమాజానికి పనికొచ్చే ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాడు. ‘జనతా గ్యారేజ్’ లో ఎన్టీఆర్ ని పర్యావరణ ప్రేమికుడిగా చూపించిన కొరటాల శివ.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను బస్తీకి చెందిన యువకుడిగా చూపించబోతున్నారు. బస్తీ విద్యార్థుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని టాక్. అవినీతితో కూడిన రాజకీయాలు, కరప్టెడ్ పొలిటీషియన్స్ ను ఎదుర్కొనే బలమైన విద్యార్థి నాయకుడి పాత్రలో ఎన్టీఆర్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఎవరు కథానాయికగా నటించనున్నారో త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికైతే పలువురు అగ్ర కథానాయికలనే సంప్రదించినట్లు తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ నే తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం.