JP Nadda Tour: బీజేపీ దూకుడు.. వరంగల్ గడ్డపైకి నడ్డా!

తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సీనియర్ నేతలు బిజీగా ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
BJP Chief

BJP Chief

తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సీనియర్ నేతలు బిజీగా ఉన్నారు. అందుకే వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత నాలుగు నెలల్లో రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి అమిత్ షా ఆదివారం మునుగోడును సందర్శించారు. ఆగస్టు 27 న హన్మకొండలో బండి సంజయ్ మూడవ దశ ప్రజాసంగ్రామ యాత్రలో భారీ బహిరంగ సభకు జెపి నడ్డా హాజరుకానున్నారు.

అమిత్ షా, నడ్డా ఇద్దరూ మూడు సార్లు రాష్ట్రానికి వచ్చారు. పార్టీ జాతీయ సర్వసభ్య సమావేశం సందర్భంగా మే 26న బేగంపేట విమానాశ్రయంలో జరిగిన సమావేశంలోనూ, జూలై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలోనూ ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రతి నెలా పర్యటించేందుకు సిద్ధమని అమిత్ షా ప్రకటించడం ఇక్కడ గమనార్హం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ శ్రీరామ్‌తో పాటు మరికొందరు ఆగస్టు 27న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

  Last Updated: 23 Aug 2022, 12:53 PM IST