Site icon HashtagU Telugu

Jammu and Kashmir: జమ్మూలో 200 అడుగుల లోయలో పడిపోయిన బస్సు: 2 మృతి, 25 మందికి గాయాలు

Doda Accident

Doda Accident

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని కొండ ప్రాంతాలైన దోడా జిల్లాలోని భలెస్సా సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. 28 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు భలెస్సా సమీపంలో 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు మరియు పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రైవేట్ మినీ బస్సు భలెస్సా నుంచి థాత్రికి వెళ్తుండగా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. భారత సైన్యం మరియు స్థానికులు సహాయం అందించారు. మరియు గాయపడిన వారిని దోడాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.

ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల రియాసిలోని శివ్ ఖోరీ నుండి కత్రాకు యాత్రికులను తరలిస్తున్న ఒక బస్సు ఉగ్రవాదుల దాడి తర్వాత లోయలో పడిపోయిన నెల తర్వాత ఈ సంఘటన జరిగింది.ఈ ఘటనలో ఓ చిన్నారి సహా తొమ్మిది మంది చనిపోయారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది.

Also Read: Byelection Results 2024: ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అట్టర్ ప్లాప్