తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పీఏ ప్రభాకర్రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఈ సోదాలు జరిగాయి. నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఈ సోదాలు నిర్వహించడంలో ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. ఈ సోదాల్లో జగదీశ్ రెడ్డి పీఏ నివాసంలో రూ.49 లక్షల నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో 30 మంది సభ్యులతో కూడిన బృందం నల్గొండ టౌన్లో మకాం వేసింది. ఈ బృందం అక్టోబర్ 31 సోమవారం సాయంత్రం ఐటీ సోదాలు ప్రారంభించగా.. మంగళవారం తెల్లవారుజామున ముగిశాయి.ఐటీ అధికారుల వెంట సెంట్రల్ పోలీసు సిబ్బంది ఉన్నారు, అయితే సోదాల సమయంలో స్థానిక పోలీసులను జగదీష్ రెడ్డి పీఏ నివాసంలోకి అనుమతించలేదు.