Israeli foreign minister: ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ మూడు రోజుల పర్యటన కోసం ఈ రోజు భారతదేశానికి వచ్చారు. అయితే ఆయన తన పర్యటనను మధ్యలోనే ఆపేసి ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం కోహెన్ టెల్ అవీవ్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ ఏడాది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు పునాది వేయడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించేందుకు కొత్త మార్గాలను చర్చించేందుకు కోహెన్ భారతదేశానికి వచ్చారు.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ట్విట్టర్ లో ‘నేను ఇప్పుడే భారతదేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నాను, నేను ఇక్కడ దిగిన వెంటనే, భద్రతా పరిస్థితి గురించి నాకు తాజా సమాచారం అందింది. ఇజ్రాయెల్లో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా, నేను నా దౌత్య పర్యటన వ్యవధిని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈరోజే జరగనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వెంటనే నేను నా దేశానికి తిరిగి వస్తాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతకుముందు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఇండియా-ఇజ్రాయెల్ బిజినెస్ ఫోరమ్కు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ మరియు ఎలి కోహెన్ సమక్షంలో భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య మూడు అవగాహన ఒప్పందాలు జరిగాయి. అదే సమయంలో కోహెన్ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ను కూడా కలిశారు.
Read More: Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే!