Site icon HashtagU Telugu

Kozhikode Terror Angle : కోజికోడ్ రైలు ఘటన ఉగ్రవాదుల పన్నాగమా? కొనసాగుతోన్న దర్యాప్తు!!

Kozikod

Kozikod

కేరళలోని కోజికోడ్‌లో (Kozhikode Terror Angle) నిన్న రాత్రి ఓ విషాదకర ఘటన కేసు వెలుగులోకి వచ్చింది. అలప్పుజా-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి ఇతర ప్రయాణికులపై పెట్రోలు పోసి ఒక వ్యక్తి నిప్పంటించడంతో భయానక వాతావరణం నెలకొంది. కదులుతున్న రైలులో మంటలు చెలరేగి ముగ్గురు మరణించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే రైల్వే ట్రాక్‌పై ముగ్గురి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి.

ఆదివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కోజికోడ్ నగరం దాటిన తర్వాత రైలు కోరాపుజ రైల్వే వంతెనకు చేరుకుంది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి ప్రయాణికులపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ అక్కడికి పరుగెత్తడం ప్రారంభించారు. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన తర్వాత, కొంతమంది ప్రయాణికులు తప్పిపోయినట్లు సమాచారం. రైల్వే ట్రాక్‌పై పోలీసులు సోదాలు నిర్వహించారు. మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఓ మహిళ, ఓ చిన్నారి, మధ్య వయస్కుడు కూడా ఉన్నారు. మంటలను చూసి కదులుతున్న రైలు నుంచి దూకేందుకు ప్రయత్నించి మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

రైలులో ప్రయాణీకులకు నిప్పంటించిన సంఘటన తరువాత, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుల కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాదుల కుట్ర ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్‌పై నుంచి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాగులో పెట్రోల్ బాటిల్, రెండు మొబైల్ ఫోన్లు లభ్యమయ్యాయి.