ఐఆర్సీటీసీ.. వాయిస్ ఆధారిత ఇ-టికెట్ బుకింగ్ ఫీచర్ను పరిచయం చేయనుంది. రాబోయే మూడు నెలల్లో Ask Disha ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్ఫారమ్లో AI – పవర్డ్ వాయిస్ ఆధారిత టికెట్ బుకింగ్ ఫీచర్ను తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఈ దిశగా ప్రస్తుతం IRCTC ప్రస్తుతం తన AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లాట్ఫారమ్లో ‘ ఆస్క్ దిశా ‘ అనే ఫీచర్ను పరీక్షిస్తోంది. ఇది కస్టమర్లకు ఆన్లైన్ టికెటింగ్ బుకింగ్ ప్రాసెస్లో వాయిస్ కమాండ్లను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించిన మొదటి దశ టెస్టింగ్ ప్రక్రియ విజయవంతమైందని తెలుస్తోంది. ఐఆర్సీటీసీ వాయిస్ ఆధారిత ఇ-టికెట్ బుకింగ్ ఫీచర్ను విడుదల చేయడానికి ముందు మరికొన్ని టెస్ట్ లను త్వరలో నిర్వహించాలని భావిస్తోంది.
“ఆస్క్ దిశ” అనేది ప్రయాణీకుల సందేహాలకు సమాధానం ఇవ్వడానికి IRCTC రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం. ఇది IRCTC అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.ప్రస్తుతం, Ask Disha కస్టమర్లు OTP ధృవీకరణ లాగిన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మరియు ఇతర సేవలకు మద్దతుని పొందేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ను ఉపయోగించడానికి వినియోగదారులు తమ IRCTC యూజర్ ఐడి మరియు పాస్వర్డ్తో లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. AI-ఆధారిత ఇ-టికెటింగ్ ఫీచర్ IRCTC యొక్క బ్యాకెండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగు పరుస్తుందని కూడా భావిస్తున్నారు. ఈ ఫీచర్ IRCTC యొక్క రోజువారీ ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
IRCTC బెంగళూరుకు చెందిన CoRover Pvt అనే స్టార్టప్ సహాయంతో Ask Disha ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసింది. 2018 అక్టోబర్లో IRCTC వినియోగదారుల కోసం AI-ఆధారిత టిక్కెట్-బుకింగ్ ప్లాట్ఫారమ్ను పరిచయం చేసింది.
Also Read: Kavitha’s Arrest: కవిత అరెస్ట్ చుట్టూ ఢిల్లీ రాజకీయం! మోడీ పై విపక్షాల లేఖాస్త్రం