Shantanu Guha Ray: సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, రచయిత శంతను గుహ రే సోమవారం కన్నుమూశారు. 25 సంవత్సరాలకు పైగా జర్నలిజానికి సేవలందించారు ఆయన. శంతను గుహ రే మృతితో మీడియా సోదరులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ మరియు ది వార్టన్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన శంతను గుహ రే, సెంట్రల్ యూరోపియన్ న్యూస్లో ఆసియా ఎడిటర్గా పనిచేస్తున్నారు.
జనరల్ వార్తలు లేదా క్రీడా , వ్యాపారం ఇలా ప్రతీ దానిపై కథనాలను రచించేవారు. శంతను గుహ రే 2011 బొగ్గు కుంభకోణం మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు GMR నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ల లీజుకు భూమికి మధ్య జరిగిన ఒప్పందంలో జరిగిన అవకతవకలపై పరిశోధనాత్మక నివేదికలకు ప్రసిద్ధి చెందారు. క్రికెట్లో అతని రచనలకు రామ్నాథ్ గోయెంకా అవార్డు, భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ మరణాలపై నివేదించినందుకు లాడ్లీ అవార్డు మరియు నీటి సంబంధిత సమస్యలపై చేసిన కృషికి వాష్ అవార్డుతో సత్కరించారు.
Also Read: Janasena: సైనికులను గాలికొదిలేసిన సేనాని