Site icon HashtagU Telugu

Driver Less Car : హైద‌రాబాద్‌లో ఇండియా ఫ‌స్ట్ డ్రైవ‌ర్ లెస్ కార్ ట్రైస్ట్ ర‌న్

Driverless Car Imresizer

Driverless Car Imresizer

ఇండియాలో మొట్టమొదటి డ్రైవర్-లెస్ కార్ టెస్ట్ రన్ IIT-హైదరాబాద్‌లో నిర్వహించారు. డ్రైవర్‌ రహిత వాహనాల నిర్వహణలో చారిత్రక తరుణంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌ (ఐఐటీ-హెచ్‌) సోమవారం తన క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని పరీక్షించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు టెస్ట్ రన్ సందర్భంగా వాహనంలో ప్రయాణించారు. మెట్రో స్టేషన్, ఇతర సామూహిక రవాణా వ్యవస్థల నుండి చివరి నిమిషంలో రవాణాను అందించాలనే లక్ష్యంతో IIT హైద‌రాబాద్ క్యాంపస్‌లోని పరిశోధకులు డ్రైవర్‌లెస్ సైకిల్‌ను కూడా అభివృద్ధి చేశారు.

ఎవరైనా మొబైల్ అప్లికేషన్‌లో సైకిల్‌ను బుక్ చేసినప్పుడల్లా.. అది GPS లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ స్వయంగా ప్రయాణికుడిని చేరుకుంటుంది .టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (టిహాన్) ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్వయంప్రతిపత్త వాహనాలను అభివృద్ధి చేయడంలో తాము గణనీయమైన పురోగతిని సాధించామని చెప్పారు. తాము భూగోళ, వైమానిక స్వయంప్రతిపత్త వాహనాలపై పని చేస్తున్నామని.. ఆగస్టు నుంచి విద్యార్థులను ఒకవైపు నుంచి మరో వైపుకు తరలించేందుకు క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్ టెరెస్ట్రియల్ వాహనాలను నడపడానికి తాము కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. తొలుత భారీ పేలోడ్ వస్తువులను డెలివరీ చేసేందుకు ఏరియల్ వాహనాలను నడపాలని యోచిస్తున్నామన్నారు.

IIT-H క్యాంపస్‌లో స్వయంప్రతిపత్త వాహనాలపై పరిశోధన పనిని చూసి ఆకట్టుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, అలాంటి ఆవిష్కర్తలకు కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయాలను అందజేస్తుందని చెప్పారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలలో భారతదేశాన్ని ఫ్రంట్ రన్నర్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని ఆయన అన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఐటీ-హెచ్ బీవీఆర్ మోహన్ రెడ్డి, ఐఐటీ-హెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రొఫెసర్ కిరణ్ కూచి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version