Site icon HashtagU Telugu

Sikkim Landslide: సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. 500 మందిని రక్షించిన సైనికులు

Sikkim Landslide

Resizeimagesize (1280 X 720) (5)

Sikkim Landslide: సిక్కిం (Sikkim)లో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి (Landslide) రోడ్లు మూసుకుపోయాయి. ఇందులో చిక్కుకున్న మహిళలు, చిన్నారులు సహా దాదాపు 500 మంది పర్యాటకులను భారత సైన్యం సురక్షితంగా రక్షించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు.

500 మంది పర్యాటకులను రక్షించారు

మే 19న మంగన్ జిల్లాలోని లాచెన్, లాచుంగ్, చుంగ్తాంగ్‌లలో భారీ కుండపోత వర్షాలు కురిశాయని, దీని కారణంగా లాచుంగ్, లాచెన్ లోయకు వెళ్లే సుమారు 500 మంది పర్యాటకులు కొండచరియలు విరిగిపడటం, రహదారి దిగ్బంధనం కారణంగా చుంగ్‌తాంగ్‌లో చిక్కుకున్నారని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. చుంగ్‌తంగ్‌లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ అభ్యర్థన మేరకు ఆర్మీ త్రిశక్తి కార్ప్స్ సిబ్బంది రంగంలోకి దిగి చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించారని ఆయన చెప్పారు.

Also Read: Robotic Surgery: దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ.. మహిళ గొంతులోని కణితిని సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు

113 మంది మహిళలు, 54 మంది పిల్లలతో సహా చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించిన తరువాత మూడు వేర్వేరు సైనిక శిబిరాలకు తీసుకెళ్లారు. వారికి వేడి ఆహారం, బట్టలు అందించారు. సైనికులు తమ బ్యారక్‌లను ఖాళీ చేసి పర్యాటకులకు వసతి కల్పించారు. లెఫ్టినెంట్ కల్నల్ రావత్ మాట్లాడుతూ.. పర్యాటకులందరినీ పరీక్షించే మూడు వైద్య బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్మీ వైద్య బృందం ప్రాథమిక వైద్య పరీక్షల్లో పర్యాటకులందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గుర్తించారు.

Also Read: Antarctica To Shadnagar : అంటార్కిటికా టు షాద్‌నగర్.. ఇస్రో 110 కోట్ల ప్రాజెక్ట్

రోడ్డును క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు

సైనికుల సత్వర చర్యతో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించారు. ఇదిలా ఉండగా వీలైనంత త్వరగా వాహనాల రాకపోకలకు రహదారిని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.