Site icon HashtagU Telugu

Mig 21 Crash: రాజస్థాన్ లో కూలిపోయిన మిగ్-21 జెట్

Rajasthan

New Web Story Copy (85)

Rajasthan: రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌లో మిగ్‌-21 జెట్‌ కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 జెట్ సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో కూలిపోవడంతో ఇద్దరు గ్రామస్తులు మరణించారు. ఆర్మీ బృందం హెలికాప్టర్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఎయిర్ ఫోర్స్ వర్గాల సమాచారం ప్రకారం విమానం సూరత్‌గఢ్ నుండి బయలుదేరింది. మిగ్-21 జెట్‌లోని పైలట్లిద్దరూ క్షేమంగా ఉన్నారని జిల్లా మేజిస్ట్రేట్ రుక్మణి రియార్ తెలిపారు. అదే సమయంలో ఇద్దరు పౌరులు మృతి చెందినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ జస్సరామ్ బోస్ తెలిపారు.

అంతకుముందు జూలై 28న రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సమీపంలో ట్విన్-సీటర్ మిగ్-21 ట్రైనర్ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు. భరత్‌పూర్‌లో శిక్షణ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు, సుఖోయ్ సు-30 మరియు మిరాజ్ 2000 కూలిపోవడంతో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక విమానం మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో, మరొకటి భరత్‌పూర్‌లో ప్రమాదానికి గురైంది. గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో హెలికాప్టర్ కూలిపోయింది. ఏప్రిల్‌లో కేరళలోని కొచ్చిలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది.

గతేడాది అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన రెండు ఘటనలు నమోదయ్యాయి. అక్టోబర్ 5 2022 న, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతానికి సమీపంలో ఒక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో భారత ఆర్మీ పైలట్ మరణించాడు. సరిగ్గా రెండు వారాల తర్వాత అక్టోబర్ 21న సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిమీ దూరంలో ఉన్న సియాంగ్ గ్రామం సమీపంలో ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (వెపన్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్) – ALH WSI కూలిపోవడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారు.

Read More: Ashok Gehlots big claim : పొలిటికల్ బాంబు పేల్చిన అశోక్ గెహ్లాట్.. రాజకీయ వర్గాల్లో కలకలం

Exit mobile version