Site icon HashtagU Telugu

India Win Gold Medal: మరో స్వర్ణ పతకాన్ని ముద్దాడిన భారత్..!

India Win Gold Medal

Compressjpeg.online 1280x720 Image 11zon (1)

India Win Gold Medal: ఆసియా క్రీడల్లో ఐదో రోజు భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆరంభించారు. భారత ఉషు క్రీడాకారిణి రోషిబినా దేవి రజత పతకం సాధించింది. ఇదే సమయంలో షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణ పతకం (India Win Gold Medal) లభించింది. పురుషుల టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమాలు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ రోజు భారత్‌కు ఇది రెండో పతకం.

అయితే, దీనికి ముందు భారత వుషు ప్లేయర్ రోషిబినా దేవి చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. వాస్తవానికి రోషిబినా దేవికి బంగారు పతకం గెలిచే అవకాశం ఉంది. కానీ ఆమె ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. 60 కిలోల మహిళల విభాగంలో చైనా క్రీడాకారిణి రోషిబినా దేవిని ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన ఫైనల్‌లో రోషిబినా దేవి విజయం సాధించి ఉంటే చరిత్ర సృష్టించేది. ఆసియా క్రీడల్లో వుషులో భారత్ ఎప్పుడూ బంగారు పతకం సాధించలేకపోయింది. రోషిబినా దేవికి స్వర్ణ పతకం సాధించే అవకాశం వచ్చినా దాన్ని చేజార్చుకుంది.

Also Read: IND vs AUS 3rd ODI: చివరి మ్యాచ్ లో ఆసీస్ విజయం

అంతకుముందు బుధవారం 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా, మణిని కౌశిక్, ఆషి చోక్సీ రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాగా, 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్ జట్టు భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. అలాగే 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సిఫ్ట్ కౌర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.