అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా 5వ సారి గెలుచుకుంది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఫైనల్లో మరో 14 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 189 పరుగులు చేసింది. భారత్ మరో 14 బంతులు మిగిలి ఉండగానే స్కోరు చేసింది. గట్టి పోటీ ఉన్నప్పటికీ, చివరికి భారత్ చిత్తుగా ఓడిపోయింది.
టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటి వరకు ఐదుసార్లు టైటిల్ను కైవసం చేసుకుంది. టీమ్ ఇండియా ఫైనల్ చేరడం వరుసగా ఇది నాలుగోసారి. 2016లో వెస్టిండీస్తో, 2020లో బంగ్లాదేశ్తో ఓడిపోయింది.
India are the 2022 ICC U19 Men's Cricket World Cup champions 🏆
They beat England by four wickets in the #U19CWC final 👏#ENGvIND pic.twitter.com/e4uhN2Pbqb
— ICC (@ICC) February 5, 2022
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యంగ్ ఇండియా అదరగొట్టింది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 189 పరుగులకే కుప్పకూలింది. ఫాస్ట్ బౌలర్లు రాజ్ బవా, రవి కుమార్లు పోటీ పడి వికెట్లు తీశారు. ముఖ్యంగా రాజ్ బవా 31 పరుగులిచ్చి ఐదు వికెట్లతో మెరిసి ఫైనల్ మ్యాచ్ను గొప్పగా మలుచుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్మన్లలో జార్జ్ థామస్(27), విల్ లుక్స్టన్(4), జార్జి బెల్(0), రెహన్ అహ్మద్(10), చివరగా జోషువా బోయ్డెన్(1)నే ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. ఈ నేపథ్యంలోనే రాజ్ బవా ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఇక ఓవరాల్గా చూసుకుంటే అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో పాకిస్తాన్ బౌలర్ అన్వర్ అలీ(2006) తర్వాత ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్గా రాజ్ బవా నిలవడం విశేషం.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦 🏆 🙌 👏 🔝#BoysInBlue | #U19CWC | #INDvENG
Scorecard ▶️ https://t.co/p6jf1AXpsy pic.twitter.com/SajoSVPvas
— BCCI (@BCCI) February 5, 2022