Lakhbir Singh Landa: కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండా (Lakhbir Singh Landa)ను ఉగ్రవాదిగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం.. 33 ఏళ్ల గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండా ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ)కి చెందినవాడు. 2021లో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్పై రాకెట్ దాడికి ప్లాన్ చేయడంలో పాల్గొన్నాడు. డిసెంబరు 2022లో తరన్ తారన్ లోని సర్హాలి పోలీస్ స్టేషన్పై ఆర్పిజి దాడితో పాటు ఇతర ఉగ్రవాద కార్యకలాపాలలో అతని ప్రమేయానికి సంబంధించి లాండా పేరు ప్రచారంలోకి వచ్చింది.
లఖ్బీర్ సింగ్ లాండా ఎవరు..?
లఖ్బీర్ సింగ్ లాండా పంజాబ్కు చెందిన వ్యక్తి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కెనడాలో నివసిస్తున్నారు. భారత్పై కుట్రకు పాల్పడ్డాడు. కెనడాకు చెందిన ఉగ్రవాది సన్నిహితులతో సంబంధం ఉన్న 48 ప్రాంతాల్లో పంజాబ్ పోలీసులు దాడులు చేశారు. ఒక వ్యాపారవేత్తపై ఇద్దరు దుండగులు దాడి చేయడంతో ఈ చర్య జరిగింది. లాండా హరికే అని చెప్పుకుని రూ.15 లక్షలు డిమాండ్ చేసిన వ్యక్తి నుంచి తనకు ఫోన్ వచ్చిందని వ్యాపారి చెప్పాడు. దాడి అనంతరం కొంతమందిని కూడా అరెస్టు చేశారు.
Also Read: Fight With Partner : భార్యాభర్తల గొడవ.. ఆ టైంలో ఈ పదాలు వాడొద్దు సుమా!
తరన్ తారన్ జిల్లాకు చెందిన లఖ్బీర్ సింగ్ లాండా గత 11 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. 2017లో కెనడాకు పారిపోయిన అతడిపై 18 కేసులు నమోదయ్యాయి. పంజాబ్లో గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయవేత్త లఖా సిద్ధా, కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాతో సహా 11 మందిపై 2022లో టార్న్ తరణ్ పోలీసులు విమోచన డిమాండ్, సరిహద్దు దాటి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. తరన్ తారన్ పోలీసులు సెప్టెంబర్ 2న ఈ కేసు నమోదు చేశారు. దీని గురించి ఎవరికీ తెలియకుండా చేశారు. గ్యాంగ్స్టర్ల మద్దతుదారులు సోషల్ మీడియాలో ఫేక్ అంటూ సందడి చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
‘‘అతడు ఉగ్రవాద స్థావరాలను పెంచడం, దోపిడీ, హత్యలు, ఐఈడీలు అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు నిధులు చేకూర్చడం, వాటి ద్వారా ఆదాయాన్ని అందుకోవడం వంటి ఎన్నో క్రిమినల్ కేసుల్లో పాల్గొన్నాడు’’అని మంత్రిత్వశాఖ తెలిపింది.