Windfall Tax: ముడి చమురుపై విండ్ ఫాల్ పన్ను తగ్గింపు

భారత ప్రభుత్వం ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును టన్నుకు రూ.6700కి తగ్గించింది. గతంలో టన్ను రూ.7100గా ఉంది. అంతేకాకుండా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటర్‌కు రూ.5.50 నుంచి రూ.6కు తగ్గించారు.

Published By: HashtagU Telugu Desk
Windfall Tax

New Web Story Copy 2023 09 02t123754.338

Windfall Tax: : భారత ప్రభుత్వం ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును టన్నుకు రూ.6700కి తగ్గించింది. గతంలో టన్ను రూ.7100గా ఉంది. అంతేకాకుండా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటర్‌కు రూ.5.50 నుంచి రూ.6కు తగ్గించారు. ఇది కాకుండా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) అంటే జెట్ ఇంధనంపై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.2 నుంచి రూ.4కి తగ్గించారు. కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి వస్తాయి.

ప్రభుత్వం ప్రతి 15 రోజులకోసారి విండ్ ఫాల్ ట్యాక్స్ ను సమీక్షిస్తుంది. ముడి చమురు ధరలు ఆకస్మికంగా పెరగడంతో ప్రభుత్వం మొదట జూలై 1, 2022 న చమురు కంపెనీలపై విండ్‌ఫాల్ పన్ను విధించింది. దాంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం లేదు. ఇది ONGC వంటి ముడి చమురు ఉత్పత్తిదారులను మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెట్రోల్-డీజిల్ ఎగుమతిదారులను ప్రభావితం చేస్తుంది.ప్రభుత్వం తొలిసారిగా గతేడాది జూలై 1 నుంచి విండ్ ఫాల్ ట్యాక్స్ ను అమలు చేసింది. అప్పట్లో ఎగుమతి సుంకం పెట్రోలు, ఏటీఎఫ్‌పై లీటర్‌కు రూ.6, డీజిల్‌పై రూ.13 చొప్పున విధించారు.

  Last Updated: 02 Sep 2023, 12:38 PM IST