పచ్చదనంతో భాగ్యనగరం కళకళలాడుతోంది. హరితహరంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలో దాదాపు 4.60కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇందుకు రూ.298.09 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా-2021 నివేదిక ప్రకారం దేశంలో దశాబ్ద కాలంలో అత్యధిక గ్రీన్ కవర్ వృద్ధి చెందిన మెగా నగరాల్లోనూ హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సత్ఫలితాలిస్తోంది.