Hyderabad: హైదరాబాద్ లో ఎండలు దంచి కొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాకాలం ముగిసినప్పటి నుంచి హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదనంగా నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్కు మించి నమోదైంది.నిన్న అంబర్పేటలో అత్యధికంగా 25.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర ప్రాంతాల్లో కూడా వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నాంపల్లి 35.5
మోండామార్కెట్ 35.4
మేరేడ్పల్లి 35.2
షేక్పేట 35.2
టీఎస్డీపీఎస్ వాతావరణ సూచనల ప్రకారం హైదరాబాద్లో రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 20-22 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండే అవకాశం ఉంది.
Also Read: ISRO: గగన్యాన్ మిషన్కు తొలి పరీక్ష చేపట్టేందుకు ఇస్రో సిద్ధం