Earthquake in Delhi: బ్రేకింగ్.. ఢిల్లీలో భారీ భూకంపం!

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది.

  • Written By:
  • Updated On - January 24, 2023 / 03:00 PM IST

దేశంలో అక్కడక్కడ భూ ప్రకంపనలు (Earthquake) సంభవిస్తున్నాయి. ఇప్పటికే జోషి మఠ్ లో ఇళ్ల మధ్య పగుళ్లు ఏర్పడటం, కూలిపోవడం జరిగాయి. ఈ ఘటన మరుకముందే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఢిల్లీ (Delhi)లో మంగళవారం ఎన్‌సీఆర్‌లో భూకంప ఘటన జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో దాదాపు 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం నేపాల్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు మితిమీరిన  పవర్ ప్రాజెక్టులు, నదులపై భారీ నిర్మాణాలు వల్ల ఇలాంటి (Earthquake) ఘటనలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు.

Also Read: Akkineni Vs Nandamuri: అక్కినేని తొక్కినేని.. టాలీవుడ్ లో ‘వారసుల’ వార్