Gurugram : గురుగ్రామ్‌లో భారీగా అక్ర‌మ మ‌ద్యం స్వాధీనం

గురుగ్రామ్‌లో ఒక ట్రక్కులో సుమారు 800 కార్టన్‌ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 03:14 PM IST

గురుగ్రామ్‌లో ఒక ట్రక్కులో సుమారు 800 కార్టన్‌ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. మనేసర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికేందర్‌పూర్ IMT, మనేసర్ సెక్టార్ 2 ప్రాంతంలో గురువారం రాత్రి గస్తీ తిరుగుతుండగా, అక్రమ మద్యం రవాణా చేస్తున్న ట్రక్కు గురించి సమాచారం అందిందని.. సమాచారం ఆధారంగా పోలీసులు విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ రోడ్డు పక్కన ట్రక్కు నిలిపి..వాహ‌నంలో ఉన్న డ్రైవ‌ర్‌ను పోలీసులు విచారించారు. డాక్యుమెంట్లు చూపించమని కోరగా.. ట్రక్కు నిండా రసాయనాలు ఉన్నాయని వే బిల్లుల‌ను డ్రైవ‌ర్ చూపించాడు. అనుమానం వ‌చ్చిన పోలీసులు ట్రక్కు లోపల తనిఖీ చేయగా.. వారికి అక్రమ మద్యం పెట్టెలు కనిపించాయి. ట్రక్కులో మొత్తం 800 కార్టన్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.