Alert: రాష్ట్రంలో అత్యధిక ఉష్టోగ్రత నమోదు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 10:35 AM IST

Alert: తెలంగాణలోని పలు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు భయపడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఎండలు భగభగమండుతున్నాయి. దీంతో రాష్ట్రం లోనే అత్యదిక ఉష్టోగ్రత నమోదయ్యాయి. ఇక అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ లోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

నిర్మల్ జిల్లా దస్తురబాద్ 43.1, అంకపూర్ 42.1, నర్సాపూర్ జి 41.9, కడెం 41.1, ఆదిలాబాద్ జిల్లా అర్లి ( టి ) 42.3 , చాప్రాల 42.2, సాత్నాల 41.6, బేలా 41.5, ఆదిలాబాద్ (Urban) 41.4, భోరక్ 41.3, జైనథ్ 41.1, మావల 41.1, ఇంద్రవెళ్లి 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు మంచిర్యాల జిల్లా కొండపూర్ 42.1, నర్సాపూర్ 40.9
భీమిని 40.7, నెన్నెల 40.3, కవ్వాల్ టైగర్ రిజర్వ్ 40.2 ఆసిపాబాద్ జిల్లా 42.5 , వంకులం 42.3, తిర్యాణీ 41.5 , కెరమెరి 41.4 , సిర్పూర్ ( టి ) 40.9, కాగజ్ నగర్ 40.9 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.