Kishtwar Encounter: జమ్మూ జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల అటవీప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కార్యకలాపాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం మరియు పారామిలటరీ బలగాల సహాయంతో నౌనట్ట, నాగేని పెయస్ మరియు పరిసర ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని, ఆ తర్వాత కొంతసేపు కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో శనివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. దీంతో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఈ భీకర కాల్పుల్లో హవల్దార్ దీపక్ కుమార్ యాదవ్, లాన్స్ నాయక్ ప్రవీణ్ శర్మ అనే ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులతో సహా మరో ఆరుగురు గాయపడ్డారు.అయితే ఈ రోజు ఆదివారం జమ్మూ డివిజన్లోని కిష్త్వార్లో ఉగ్రవాదులు, బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. జైషే ఉగ్రవాదుల బృందాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు సమాచారం. రెండు వైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా, దీనికోసం సైన్యం పారా కమాండోలను రంగంలోకి దించింది.
#WATCH | Anantnag, J&K: Operation underway by Indian Army to track down terrorists at Ahlan Gadool in Kokernag area. Two Army soldiers lost their lives in action and two civilians were injured in the operation.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/3FXuVy0iLX
— ANI (@ANI) August 11, 2024
ప్రత్యేక దళాల పారా కమాండోలతో సహా అనేక మంది సైనికులు ఈ ప్రాంతంలో మోహరించారు. ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రదేశం 15 కి.మీ ఎత్తులో ఉంది. ఈ క్రమంలో సెర్చ్ ఆపరేషన్లో నిమగ్నమైన సైనికులపై ఉగ్రవాదులు ఎత్తు నుంచి కాల్పులు జరిపారు. ఇరువైపులా భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
కాగా నిన్న కాల్పుల్లో మరణించిన జవాన్ల పట్ల సైన్యం సంతాపం వ్యక్తం చేసింది. భారత సైన్యం ఒక ట్వీట్లో ఇలా రాసింది, “సైన్యం ధైర్యసాహసాలు నేటికీ అమరమైనవి. వారు శాశ్వతమైన శాంతితో విశ్రాంతి తీసుకుంటున్నారు అంటూ సంతాపం తెలిపారు.మరియు మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.
Also Read: MS Dhoni: ధోనీపై ఫిర్యాదు.. ఆగస్టు 30లోగా సమాధానం చెప్పాలని కోరిన బీసీసీఐ..!