హైదరాబాద్లోని నాగోల్లోని స్నేహపురి కాలనీలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నగల దుకాణంలోకి చొరబడి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ షాకింగ్ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించి బంగారాన్ని తమకు ఇవ్వాలని వర్కర్స్ ను బెదిరించినట్లు సమాచారం. అయితే వర్కర్స్ అందుకు నిరాకరించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత దొంగలు మూడుసార్లు కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలతో పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది.