Site icon HashtagU Telugu

Building Collapse: గుజరాత్‌లో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, నష్ట పరిహారం ప్రకటించిన సీఎం

Building Collapse

Jamnagar Pti 1230623 1687538883

Building Collapse: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శుక్రవారం మూడు అంతస్తుల భవనం (Building Collapse) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ముగ్గురు మృతి చెందినట్లు మున్సిపల్ కమిషనర్ డీఎన్ మోదీ ధృవీకరించారు. ఈ అపార్ట్‌మెంట్ సురక్షితం కాదని ప్రకటించడంతో గుజరాత్ హౌసింగ్ బోర్డు ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించకుండా ప్రజలను పలుమార్లు హెచ్చరించిందని ఆయన చెప్పారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

సీఎం పరిహారం ప్రకటించారు

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పరిహారం ప్రకటించారు. జామ్‌నగర్‌లో నివాస భవనం కుప్పకూలడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతులకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ప్రభుత్వం నుంచి అందజేస్తారని ఆయన తెలిపారు.

Also Read: Cruise Missiles: రష్యాకు చెందిన 13 క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసిన ఉక్రెయిన్

ఈ భవనాన్ని మూడు దశాబ్దాల క్రితం నిర్మించారు

అంతకుముందు అగ్నిమాపక దళం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో నలుగురిని సురక్షితంగా రక్షించారు. అయితే శిథిలాల కింద ఎనిమిది నుండి పది మంది వరకు ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. ఒక అధికారి మాట్లాడుతూ.. సాధనా కాలనీలో మూడు అంతస్తుల నివాస భవనం సాయంత్రం కూలిపోయింది. ఆపరేషన్ కొనసాగుతోంది. నలుగురిని రక్షించారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం గుజరాత్ హౌసింగ్ బోర్డు ఈ భవనాన్ని నిర్మించారు అని ఆయన పేర్కొన్నారు.

సాయంత్రం 6 గంటలకు భవనం కూలిపోయింది

ఘటనా స్థలికి చేరుకున్న డీఎన్‌ మోదీ, మున్సిపల్‌ సీనియర్‌ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే దివ్యేశ్‌ అక్బరీ వారి ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు భవనం కూలిపోవడంతో భవనం శిథిలావస్థకు చేరిందని, లోపల ప్రజలు ఉన్నారని స్థానికులు తెలిపారు. శిథిలాల నుండి నలుగురిని బయటకు తీసి ఆసుపత్రిలో చేర్చారని, ఎనిమిది నుండి పది మంది శిథిలాల కింద ఉండవచ్చు అని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు.