Site icon HashtagU Telugu

Visakhapatnam: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి బ్యాంకాక్ కు డైరెక్ట్ ఫ్లైట్

Flight

Flight

Visakhapatnam: ఎయిర్ ఏషియా విశాఖపట్నం-బ్యాంకాక్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత విశాఖపట్నం నుండి విదేశీ విమానాన్ని ప్రవేశపెట్టిన రెండవ అంతర్జాతీయ విమానయాన సంస్థగా నిలిచింది. విశాఖపట్నం నుంచి సింగపూర్ కు తొలి అంతర్జాతీయ విమానం స్కూట్. వారానికి మూడు సార్లు (మంగళ, గురు, శనివారాలు) బ్యాంకాక్ కు ఎయిర్ ఏషియా విమానాలను నడపనుంది. బ్యాంకాక్ నుంచి రాత్రి 10.05 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖపట్నంలో రాత్రి 11.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటుంది.

బ్యాంకాక్ కు వెళ్లే తొలి విమానంలో 80 శాతం ప్రయాణీకులు ప్రయాణించారు. టికెట్ ధరలు బడ్జెట్ ఫ్రెండ్లీగా రూ.10,000 నుంచి రూ.23,000 వరకు ఉంటాయి.  కిశోర్ (ఎయిర్ ఏషియా సౌత్ అండ్ వెస్ట్ ఇండియా రీజనల్ మేనేజర్), విట్యూనీ కుంటపెంగ్ (ఎయిర్ ఏషియా హెడ్, గ్లోబల్ గెస్ట్ సర్వీసెస్), విజయ్ మోహన్ (టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధి), విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి విమాన సర్వీసుల గురించి తెలియజేశారు.