Gold Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రూ. 64 వేలకు చేరిన బంగారం ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు మరోసారి పెరిగాయి.

  • Written By:
  • Updated On - December 29, 2023 / 07:41 AM IST

Gold- Silver Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు మరోసారి పెరిగాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,900గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,250గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ. 81,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (డిసెంబర్ 29, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Sub Variant JN.1: 157కి చేరిన కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు.. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.64,400గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,850గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.64,250 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,250గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,250గా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 79,500 ఉండగా, ముంబైలో రూ.79,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,000 ఉండగా, కోల్‌కతాలో రూ.79,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.77,000 ఉండగా, కేరళలో రూ.81,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,000 ఉండగా, విజయవాడలో రూ.81,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.