Gold- Silver Price: ఈరోజు కూడా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు పెరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Gold Price

Gold Price

Gold- Silver Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు పెరిగాయి. గురువారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,040గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.77,700కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (నవంబర్ 16, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Railway Recruitment: డిప్లొమా అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,190గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,580గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,040 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040గా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,700 ఉండగా, ముంబైలో రూ.74,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,700 ఉండగా, కోల్‌కతాలో రూ.74,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.77,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,700 ఉండగా, విజయవాడలో రూ.77,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 16 Nov 2023, 07:39 AM IST