Gold Seized : జనగాంలో పోలీసులు త‌నిఖీలు.. ఓ కారులో 5.4 కిలోల బంగారం స్వాధీనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా మ‌ద్యం, డ‌బ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా

Published By: HashtagU Telugu Desk
Gold

Gold

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా మ‌ద్యం, డ‌బ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ సరైన పత్రాలు లేని నగదు, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మాల టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. కారులో 5.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ రూ. 3.09 కోట్లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తులు అవసరమైన పత్రాలు అందించకపోవడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. నవంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసి, అదే రోజు నామినేషన్ల దాఖలు చేయనుంది. రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించి అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయగా, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఇంకా పూర్తి కాలేదు.  అయితే ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు  రాజ‌కీయ నాయకులు డ‌బ్బు, బంగారం, ఖ‌రీదైన వ‌స్తువుల‌ను పంచుతున్నారు. దీనిపై ఎన్నిక‌ల సంఘం  గ‌ట్టి నిఘా పెట్టింది.

Also Read:  Nara Bhuvaneswari : నారా భువనేశ్వ‌రి ప్ర‌చార ర‌థం సిద్ధం.. నిజం గెల‌వాలి పేరుతో జ‌నంలోకి

  Last Updated: 24 Oct 2023, 12:53 PM IST