Gold Price Today: మహిళలకు కన్నీళ్లు పెట్టిస్తున్న బంగారం ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) పెరిగాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,780గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 09:10 AM IST

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) పెరిగాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,780గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 75,400 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (మార్చి 24, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Kotamreddy Giridhar Reddy : ప‌సుపుమ‌య‌మైన నెల్లూరు.. నేడు టీడీపీలో చేర‌నున్న కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,930గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,430గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,780 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,830గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,600 ఉండగా, ముంబైలో రూ.72,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.75,400 ఉండగా, కోల్‌కతాలో రూ.72,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,400 ఉండగా, కేరళలో రూ.75,400గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,400 ఉండగా, విజయవాడలో రూ.75,400 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.