Hyderabad Bonalu 2024: రేపు జులై 28 ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల పండుగ ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఒకరోజు ముందు అంటే ఈ రోజు శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. భక్తుల కోసం నగరంలో నీరు, పారిశుధ్యం తదితర అంశాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆమ్రపాలి పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. జోనల్ కమిషనర్లు మరియు డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో, బోనాల పండుగ సందర్భంగా తాగునీటి ఏర్పాట్లు, గుంతలను కప్పి ఉంచడం, పారిశుద్ధ్య నిర్వహణ, అవసరమైన చోట మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు.
వీధి వ్యాపారులు చెత్తను బయట వేయకుండా చూడాలని, చెత్త కుండీల్లో చెత్తను వేసే విధంగా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. దేవాలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని కోరారు. కమ్యూనిటీ హాళ్ల వివరాలు, కమ్యూనిటీ హాళ్లలో అవసరమైన మరమ్మతులు, ఎవరి ఆధీనంలో ఉన్నాయో పూర్తి నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
Also Read: Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు