Kothagudem: బొగ్గు టిప్పర్ ఢీ, నలుగురు మహిళలు మృతి!

కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద శుక్రవారం మినీ గూడ్స్ వాహనాన్ని బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో

Published By: HashtagU Telugu Desk
Tipper

Tipper

కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద శుక్రవారం మినీ గూడ్స్ వాహనాన్ని బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో నలుగురు వ్యవసాయ మహిళా కూలీలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సుజాతనగర్ మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన మృతులు చండ్రుగొండలో మిర్చిపంటలో పని చేసేందుకు గూడ్స్ వాహనంలో వెళుతున్నారు. అతివేగంగా వస్తున్న బొగ్గు టిప్పర్‌ గూడ్స్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో మహిళలు మృతి చెందారు.

ఘటన జరిగినప్పుడు వాహనంలో దాదాపు 15 మంది కూలీలు ఉన్నారు. మృతులను కత్తి స్వాతి (26), కాతి సాయమ్మ (45), అక్కిరాల సుజాత (46), గుర్రం లక్ష్మిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ స్థానికులు, మృతుల బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో ప్రమాదం గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

  Last Updated: 28 Jan 2022, 02:56 PM IST