Site icon HashtagU Telugu

Schools Get Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్ల‌కు మ‌ళ్లీ బాంబు బెదిరింపులు!

Schools Get Bomb Threats

Schools Get Bomb Threats

Schools Get Bomb Threats: వరుసగా మూడో రోజు బాంబు బెదిరింపులు (Schools Get Bomb Threats) రావడంతో ఢిల్లీలోని పలు పాఠశాలలు భయాందోళనకు గురయ్యాయి. DPS RK పురంతో సహా అనేక ఇతర పాఠశాలలకు ఈ బెదిరింపులు వ‌చ్చాయి. బెదిరింపు ఇమెయిల్ రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాఠశాలలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో బెదిరింపు ఇమెయిల్‌లు వస్తున్న ఘటనలు ఇంకా ఆగలేదు. ఈ క్రమంలోనే విద్యార్థులు, సామాన్య‌లు భయం నీడలో బతకాల్సి వస్తోంది.

పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌ల ప్రవాహం ఆగడం లేదు

పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌ల‌ ప్రక్రియ ఆగడం లేదు. అంతకుముందు డిసెంబర్ 13న ఢిల్లీలోని కైలాష్ డీపీఎస్ ఈస్ట్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, మోడ్రన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ, విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. డిసెంబర్ 9న కూడా ఢిల్లీలోని 40 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. గత కొన్ని నెలలుగా ఢిల్లీ, జైపూర్, బెంగళూరు సహా పలు నగరాల్లోని పాఠశాలలకు ఇలాంటి మెయిల్స్ వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య భయానక వాతావరణం నెలకొంది.

Also Read: BJP Leader Lal Krishna Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఢిల్లీ అపోలోలో చేరిక‌!

విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు

ఢిల్లీ పోలీసుల ప్రకారం.. డిసెంబరు 14న‌ శనివారం పాఠశాల నిర్వాహకులకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఉదయం 6 గంటల ప్రాంతంలో పాఠశాల అగ్నిమాపక శాఖకు సమాచారం అందించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇమెయిల్ పంపే ID.. IP చిరునామా కూడా దర్యాప్తు చేస్తున్నారు.