Site icon HashtagU Telugu

Food Grain Prices: సామాన్యులకు షాక్.. 15 రోజులో భారీగా పెరిగిన బియ్యం పప్పు ధరలు?

Food Grain Prices

Food Grain Prices

రుతుపవనాలు మందగించడంతో ఖరీఫ్ పంటలు నాట్లు వేయడంలో జాప్యం నెలకొంది. దాని కారణంగా గత 15 రోజుల్లో బియ్యం అలాగే పోహా, పప్డ్ రైస్, జోవర్, బజ్రా, చికెన్ 5 నుంచి 15 శాతం పెరిగాయి. త్వరలో నియంత్రణ వంటి ప్రభుత్వ ప్రయాణాలు కూడా ఇటువంటి ప్రభావం చూపడం లేదు. దాంతో గోధుమలు పప్పులు ధరలు కూడా అధిక స్థాయిలో పెరిగాయి. వర్షాలు కురిసి నాట్లు వేసేందుకు అనుకూలంగా మారేవరకు ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది అని మార్కెట్ అధికారులు విశ్లేషకులు తెలుపుతున్నారు.

రానున్న రోజుల్లో దేశంలో ద్రవయోల్బణం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వరీ పప్పు ధాన్యాలు అయినా పెసర,మినములు,కంది, నూనె గింజలు,వేరుశనగ, సోయాబీన్ వంటివి ఖరీఫ్ సీజన్ లో పండించే ప్రధాన ఆహారాల ఉత్పత్తులు. జై రాజ్ గ్రూప్ డైరెక్టర్ రాజేష్ షా ఈ విషయంపై మాట్లాడుతూ.. రుతుపవనాల ఆలస్యం కారణంగా బియ్యం సంబంధిత ఉత్పత్తులు గత రెండు వారాల్లో సుమారు 15% పెరిగాయి. జొన్నలు సజ్జల ధరలు కూడా పెరిగాయి. పప్పులు గోధుమ ధరలు తగ్గలేదు. ఒకవేళ సకాలంలో వర్షాలు పడకపోతే ధాన్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అని తెలిపారు.

ఇకపోతే ఋతుపవనాలు ఏడు నుంచి పది రోజులు మరింత ఆలస్యం కావడం వల్ల పప్పు ధాన్యాల పంటల విస్తీర్ణం పై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇది మొత్తం పప్పుధాన్యాల ధరలు పెరగవచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ అండ్ అనలిటిక్స్ డైరెక్టర్ పూషన్ శర్మ తెలిపారు. వరి వంటి ఇతర ప్రధాన వంట పంటలకు, జులైలో వర్షాలు పడకపోతే వరి విస్తీర్ణం తగ్గవచ్చు.