Jharkhand : ఛత్రాలో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్‌, ఐదుగురు మావోయిస్టులు మృతి.!

  • Written By:
  • Updated On - April 3, 2023 / 12:09 PM IST

జార్ఖండ్‌లోని (Jharkhand) చత్రా జిల్లా సరిహద్దులో భద్రతా బలగాలు, సీపీఐ మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పలాము-ఛత్ర సరిహద్దులో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. సిఆర్‌పిఎఫ్ కోబ్రా బెటాలియన్, జెఎపి, ఐఆర్‌బితో పాటు పాలము, చత్ర జిల్లా బలగాలు ఆపరేషన్‌లో భారీగా  మొహరించాయి.

 

నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా పాలము-ఛత్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ధృవీకరించలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.