బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పాట్న నుండి గౌహతి వెళ్తోన్న గౌహతి బికనీర్ ఎక్స్ ప్రెస్ బెంగాల్ లోని మైనాగురి సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాదసమయంలో 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Guwahati-Bikaner Express derailed near Domohani (West Bengal), this evening. No report of any casualties. Details awaited. pic.twitter.com/7q02rbW7T1
— ANI (@ANI) January 13, 2022
ప్రమాదంలో ఆరు బోగీలు తలకిందులై మరో ఆరు బోగీలు దెబ్బతిన్నాయి. ఇందులో ఐదుగురు మరణించగా ఇరవై మందికిపైగా గాయాలయ్యాయి. గాయపడినవారిని దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. రైలులోని బోగీలు బోల్తా కొట్టగానే రైలు పట్టాలు తప్పి ఉంటుందని భావించి ట్రైయిన్ నుండి దూకామని రైలు ప్రయాణికులు తెలిపారు.
రైలు ప్రమాదంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై బెంగాల్ సీఎం తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మమత అధికారులను ఆదేశించారు.
Bikaner-Guwahati Express #TRAIN derailed at Mainaguri, many passengers feared dead, The accident took place in Domohani area on Thursday. pic.twitter.com/feQr8V64Vs
— Ajay Jandyal (@ajayjandyal) January 13, 2022