Site icon HashtagU Telugu

Five Budgets: దేశాన్ని మార్చిన 5 బడ్జెట్లు ఇవే.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్..!

Taxes Reduce

Taxes Reduce

Five Budgets: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన ఆరో బడ్జెట్‌ (Five Budgets)ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల సంవత్సరం అయినందున ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ అవుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ రానుంది. దీనిపై ప్రజలకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ దేశంలో అనేక పెద్ద మార్పులను తీసుకొచ్చిన దేశంలోని అలాంటి 5 బడ్జెట్‌లను ఈ రోజు మేము మీకు పరిచయం చేయ‌బోతున్నాం. ఈ బడ్జెట్లన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపాయి. ఈ 5 బడ్జెట్‌లను ఒకసారి పరిశీలిద్దాం.

TT కృష్ణమాచారి (1957-58)

డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. టిటి కృష్ణమాచారి 1957-58 ఆర్థిక సంవత్సరంలో పన్ను సంస్కరణలను అమలు చేశారు. ఇందులో ప్రజల వ్యక్తిగత ఆస్తులపై సంపద పన్ను విధించారు. ఈ సంపద పన్ను 2015 వరకు వివిధ మార్పులతో కొనసాగింది. దీని తర్వాత అది ముగిసింది.

మన్మోహన్ సింగ్ (1991–92)

ప్రధానమంత్రి నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఆయన ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిని చేశారు. ఆ సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ 1991-92లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పటికీ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా కనిపిస్తుంది. కానీ మ‌న్మోహన్ సింగ్ అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. దీని వల్ల దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా కాపాడింది. రాజకీయ నాయకుడిలా కాకుండా ఆర్థికవేత్తలా నిర్ణయాలు తీసుకున్నారు. తన అనుభవాలను ఉపయోగించి అతను దిగుమతి-ఎగుమతి విధానంలో సమూల మార్పులు చేశాడు. అలాగే భారత మార్కెట్‌ను ప్రపంచం మొత్తానికి తెరిచింది. కస్టమ్ డ్యూటీని 220 శాతం నుంచి 150 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా ఎగుమతులు పెంచేందుకు కూడా నిర్ణయాలు తీసుకున్నారు.

Also Read: Shobha Shetty Yaswanth Reddy Engagement : హౌస్ లో అనౌన్స్ మెంట్.. ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్..!

పి.చిదంబరం (1997–98)

నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సహచరుడిగా ఉన్న పి. చిదంబరం 1997-98లో మార్పులతో కూడిన మరో బడ్జెట్‌ను సమర్పించారు. ఆర్థిక నిపుణులు డ్రీమ్ బడ్జెట్ హోదా ఇచ్చారు. ఇందులో చిదంబరం ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను తగ్గించారు. ఆదాయపు పన్ను గరిష్ట రేటును 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. అనేక సర్‌ఛార్జ్‌లు కూడా తొలగించబడ్డాయి. ఈ బడ్జెట్‌ను దేశ ప్రజలు, పరిశ్రమలు ఎంతో మెచ్చుకున్నాయి.

యశ్వంత్ సిన్హా (2000-01)

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకుముందు చంద్రశేఖర్ ప్రభుత్వం పతనం కావడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయారు. యశ్వంత్ సిన్హా ఈ బడ్జెట్ ఐటీ రంగంలో విప్లవం తీసుకురావడానికి ప్రసిద్ధి చెందింది. అతను 21 వస్తువులపై కస్టమ్ సుంకాన్ని తగ్గించాడు. వీటిలో ఒకటి కంప్యూటర్ కూడా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. నేడు ప్రపంచం మొత్తం భారత ఐటీ రంగం బలాన్ని గుర్తిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అరుణ్ జైట్లీ (2017-18)

దేశంలో రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి పలికిన వ్యక్తి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ముందు రైల్వే మంత్రి ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్‌ను, ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేవారు. అయితే అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

Exit mobile version