Dowleswaram : దౌలేశ్వరం బ్యారేజీ వద్ద మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ

దౌలేశ్వరం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీకి భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుంది. గ‌త వారం రోజుల‌గా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ఎగువ

  • Written By:
  • Publish Date - July 27, 2023 / 07:50 AM IST

దౌలేశ్వరం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీకి భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుంది. గ‌త వారం రోజుల‌గా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ఎగువ నుంచి భారీగా వ‌ర‌ద నీరు ప్రాజెక్టులోకి వ‌చ్చి చేరుతంది. దీంతో ఈ రోజు (గురువారం) ఉదయం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొద‌టి ప్ర‌మాద హెచ్చరిక జారీ చేశారు. ఈ సమయంలో 10,02,425 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. డెల్టా సాగునీటి కాలువలకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు భద్రాచలంలో వరద మట్టం 50.30 అడుగులకు చేరింది. రెండవ హెచ్చరిక అమలులో ఉంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ వరద ప్రవాహం దౌలేశ్వరం బ్యారేజీకి చేరుతుంది. ఈరోజు రాత్రి వరకు బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.