రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ రంగులు, ఇతర వస్తువులను తయారు చేస్తున్న కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్లెండ్ కలర్స్ అనే పేరుతో ప్లాస్టిక్ రంగులు, పేపర్లు, కవర్ల ప్రైవేట్ తయారీ కంపెనీలో రాత్రి 8:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కంపెనీ కార్మికులు దాదాపు తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అపోలో ఆసుపత్రి DRDOకి తరలించామని షాద్నగర్ పోలీస్ స్టేషన్ అడ్మిన్ SI విజయ్ తెలిపారు.ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.