Fierce fire in Dhanbad:​ ధన్​బాద్​లో అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి.. మృతుల్లో వైద్య దంపతులు కూడా

ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో డాక్టర్ వికాస్ హజారా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజారా సహా వీరి పనిమనిషి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల్లో కాలిపోవడం వల్ల కాదు, విషపు పొగలు రావడంతో ఊపిరాడక చనిపోయారు.

  • Written By:
  • Publish Date - January 28, 2023 / 10:20 AM IST

ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో డాక్టర్ వికాస్ హజారా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజారా సహా వీరి పనిమనిషి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల్లో కాలిపోవడం వల్ల కాదు, విషపు పొగలు రావడంతో ఊపిరాడక చనిపోయారు. డాక్టర్ హజారాకు చెందిన రెండు పెంపుడు కుక్కలు కూడా ఊపిరాడక చనిపోయాయి. డాక్టర్ వికాస్ హజారా హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సిసి హజారా కుమారుడు, డాక్టర్ ప్రేమ హజారా అతని కోడలు. ఈ ప్రమాదంలో రోగులెవరూ చనిపోలేదని పోలీసులు తెలిపారు. ఇంటికి, ఆస్పత్రికి ఉన్న కారిడార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఏర్పడటంతో ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న బ్యాంక్‌మోడ్ పోలీస్ స్టేషన్, అగ్నిమాపక బృందం పురానా బజార్ ఎక్స్‌ఛేంజ్ రోడ్డులో ఉన్న హజ్రా ఆసుపత్రికి చేరుకుంది. మృతదేహాలను SNMMCH (షహీద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్) కు పంపించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని ఇతర ఆస్పత్రుల్లో చేర్పించారు. హాస్పటల్, డాక్టర్ హజ్రా నివాసం కలిసి ఉన్నాయి. ఈ ఈ తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది బ్యాంక్‌మోడ్‌ పోలీస్‌ స్టేషన్‌కు, అగ్నిమాపక సిబ్బందికి 2.30 గంటల సమయంలో సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజామున 2.45 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

దల్కాల్ బృందం కూడా ఆసుపత్రికి ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంట్‌లో మంటలను ఆర్పడం ప్రారంభించింది. ఎలాగోలా టీం సభ్యులు డాక్టర్ హజ్రా ఇంటి లోపలికి చేరుకున్నారు. అప్పటి వరకు డాక్టర్ వికాస్ హజ్రా ఊపిరి పీల్చుకున్నారు. అతడిని అక్కడి నుంచి తరలించి హజ్రా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. దీని తర్వాత SNMMCHకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మంటలను ఆర్పే క్రమంలో ఫైర్‌మెన్ మనీష్ కుమార్ కూడా కాలిపోయాడు. ఇక్కడ డీఎస్పీ లా అండ్ ఆర్డర్ అరవింద్ కుమార్ బిన్హా, బ్యాంక్‌మోడ్ ఎస్‌హెచ్‌ఓ పీకే సింగ్‌తో పాటు బ్యాంక్‌మోడ్ పోలీస్ స్టేషన్ మొత్తం బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.

Also Read: Former PM Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు.. నన్ను చంపాలని చూస్తున్నారు..!

తెల్లవారుజామున 1.30 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఆసుపత్రి ఉద్యోగి బంటి కుమార్ తెలిపారు. మూడు అంతస్తుల భవనంలో డాక్టర్ దంపతులు మొత్తం కుటుంబంతో నివసిస్తున్నారు. మూడో అంతస్తులోని కారిడార్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీని తర్వాత డాక్టర్ వికాస్ హజ్రా, డాక్టర్ ప్రేమ హజ్రా గదిలో భారీగా పొగలు వ్యాపించాయి. సరస్వతి పూజ సందర్భంగ, అతని సోదరి సోహైల్‌తో సహా మరో నలుగురు సభ్యులు వచ్చారు. వారు మూడవ అంతస్తులో ఉన్నారు. ప్రమాద సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. పొగలు కమ్ముకోవడంతో వారు చనిపోయారు. తెల్లవారుజామున 3:30 గంటలకు అన్ని మృతదేహాలను పాట్లీపుత్ర నర్సింగ్ హోమ్‌కు తరలించారు. ఇక్కడ అందరూ చనిపోయినట్లు ప్రకటించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెడికల్‌ కాలేజీకి తరలించారు.