Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

గుజరాత్‌లోని (Gujarat) నవ్‌సారిలో శనివారం తెల్లవారుజామున బస్సు, ఎస్‌యూవీ ఢీకొన్న ప్రమాదంలో

  • Written By:
  • Updated On - December 31, 2022 / 09:46 AM IST

వెస్మా గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు వల్సాద్ వైపు వెళ్తుండగా, ఎస్‌యూవీ ఎదురుగా వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని నవ్‌సారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రుషికేష్ ఉపాధ్యాయ తెలిపారు. ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న వారు అంక్లేశ్వర్ (గుజరాత్‌లోని) నివాసితులు. వారు వల్సాద్ నుండి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారని, బస్సులోని ప్రయాణికులు వల్సాద్‌కు చెందినవారని ఉపాధ్యాయ్ తెలిపారు. గుజరాత్‌లోని నవ్‌సారిలో శనివారం తెల్లవారుజామున బస్సు, ఎస్‌యూవీ ఢీకొన్న ప్రమాదంలో (Accident) తొమ్మిది మంది మృతి చెందగా, మరో 32 మందికి గాయాలయ్యాయి.

గాయపడిన 32 మందిలో 17 మందిని వల్సాద్‌లోని ఆసుపత్రికి, 14 మందిని నవ్‌సారిలోని ఆసుపత్రికి, మరో క్షతగాత్రుడిని చికిత్స కోసం సూరత్‌కు తరలించినట్లు అదనపు జిల్లా కలెక్టర్ కేతన్ జోషి తెలిపారు. తొమ్మిది మృతదేహాలను పోలీసు బృందాలు స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించినట్లు జోషి తెలిపారు. ఎస్‌యూవీ (ఫార్చ్యూనర్)లో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని, వారు అంక్లేశ్వర్‌లోని ఒక సంస్థలో ఉద్యోగులుగా ఉన్నారని, బస్సు అహ్మదాబాద్ నుండి వల్సాద్‌కు ప్రజలను తీసుకువెళుతున్నదని ఆయన చెప్పారు. ప్రమాదానికి (Accident) గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదని, అయితే రాంగ్ డైరెక్షన్‌లో వస్తున్న ఎస్‌యూవీ బస్సును ఢీకొనక ముందే డివైడర్‌ను ఢీకొట్టిందని జోషి తెలిపారు. ఎస్‌యూవీ డ్రైవర్ నిద్రమత్తులో పడి ఉంటాడని పరిశోధకులు అంచనా వేస్తున్నారని ఆయన అన్నారు.

వెస్మా గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు వల్సాద్ వైపు వెళ్తుండగా, ఎస్‌యూవీ ఎదురుగా వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని నవ్‌సారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రుషికేష్ ఉపాధ్యాయ తెలిపారు. ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న వారు అంక్లేశ్వర్ (గుజరాత్‌లోని) నివాసితులు. వారు వల్సాద్ నుండి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారని, బస్సులోని ప్రయాణికులు వల్సాద్‌కు చెందినవారని ఉపాధ్యాయ్ తెలిపారు.

Also Read;  TTD : 2022 సంవత్సరంలో తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు