Fire Accident : ఈజిప్టులోని ఓ చర్చిలో ఘోర అగ్నిప్రమాదం…41మంది దుర్మరణం..!!

ఈజిప్టులో ఘోరం జరిగింది. కైరోనగరంలోని ఓ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు.

  • Written By:
  • Publish Date - August 14, 2022 / 06:39 PM IST

ఈజిప్టులో ఘోరం జరిగింది. కైరోనగరంలోని ఓ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు.అబు సిఫైనే చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో తప్పించుకునే వీల్లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తేలియలేదని చర్చి వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు.

ఈ చర్చి కాప్టిక్ ప్రజలకు చెందింది. మధ్య ప్రాచ్యంలో కాప్టిక్ వర్గం అత్యంత పెద్దదైన క్రైస్తవ సమాజంగా గుర్తింపు పొందింది. ఈ జిప్టు జనాభ 103మిలియన్లు కాగా అందులో పది మిలియన్ల మంది కాప్టిక్ ప్రజలే. ముస్లిం మెజార్టీ దేశం ఈజిప్టులో కాప్టిక్ ప్రజలపై హింస చోటుచేసుకుంటోంది.