Revanth Reddy: రేవంత్ రెడ్డితో గురునాథ్ రెడ్డి భేటీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

  • Written By:
  • Updated On - January 27, 2023 / 12:10 PM IST

హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఆర్. గురునాథ్ రెడ్డి, ఆయన కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ఫిబ్రవరి 6 నుంచి జరిగే హాత్ సే హాత్ జోడో యాత్ర, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో గురునాథ్ రెడ్డికి ఉన్న అనుబంధం చర్చకు వచ్చింది. వీరిద్దరి భేటీతో కొడంగల్ రాజకీయాల్లో మార్పు రానుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.